హిందూమతంలో వినాయకుని ప్రాముఖ్యత
Source:Pinterest
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం
బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు
అధిపతి (గణనాయకుడు,
గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు
తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ
సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో
వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో
వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా
సంప్రదాయాలు పంచాయతన విధానములు)
వినాయకుడు శివపార్వతుల
పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు
ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత
పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత
ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి
సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.
హిందూమతంలో
వినాయకుని ప్రాముఖ్యత:
5వ శతాబ్దికి చెందిన
పాలరాతి వినాయక విగ్రహం. - గర్దెజ్, ఆఫ్ఘనిస్తాన్లో
లభించింది. ప్రస్తుతం కాబూల్ "దర్గా పీర్ రత్తన్ నాథ్"లో ఉంది. - విగ్రహ
పీఠంపై ఇలా వ్రాసి ఉంది "మహావినాయకుని గొప్ప సుందర మూర్తి"- షాహి
రాజు ఖింగలునిచే ప్రతిష్ఠింపబడింది.
· భారతదేశంలో
వినాయకుడిని గణేశుడు, గణపతి,
విఘ్నేశ్వరుడు, గణనాధుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు.
హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాధాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని
ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు.
· శైవం, వైష్ణవం, శాక్తేయం,
జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా
వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.
· వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా
అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక
వాహనం అడ్డంకులు తొలగించే గుణంవిద్యా, బుద్ధి ప్రదాత. ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి)
ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం
· వైదిక కాలంనుండి, అంతకుముందు
ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలోవినాయకునికి ఇప్పుడు
మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో
రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం
పొందింది.
· 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది.
వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో
ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, మరియు గణపతి అథర్వశీర్షము.
Comments
Post a Comment